Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 4:59 pm Posted by : ramakrishna

హైదరాబాద్ తరలిన మాలలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సికింద్రబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీ.న్ రమేష్ ఆధ్వర్యంలో మాల సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి చిన్న సాయిలు, జిల్లా అధ్యక్షులు జె. కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగారి మహేందర్, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు కస్కుర్తి ప్రదీప్ కుమార్, మండల అధ్యక్షులు ఎడ్ల కిషన్, దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు జేగ్గ సాయిలు, మండల ఉపాధ్యక్షుడు జె.గోపాల్, అంబేద్కర్ సేనా అధ్యక్షులు మంత్రి పెద్ద సాయిలు, మండల నాయకులు జె. శ్రవణ్, ఎన్.శివ, ఎన్.మంజునాథ్ తదితరులు మాలల సింహగర్జన కార్యక్రమానికి తరలి వెళ్ళారు.