Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 4:36 pm Posted by : ramakrishna

24 వ రోజుకు చేరిన సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర

రుద్రూర్, బతుకమ్మ : సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర మంగళవారం నాటికి 24 వ రోజుకు చేరింది. శ్రీ గురు వినయ్ స్వామి, వసంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలై వరకు మహా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. రుద్రూర్ నుండి అయ్యప్ప స్వాములు అక్టోబర్ 27వ తేదీన శబరిమల వరకు మహాపాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. 830 కిలో మీటర్లు పాదయాత్ర ఈ రోజు పాల్ కోడె నుండి తడగం వరకు చేరుకుంది. ఈ పాదయాత్రలో అయ్యప్ప స్వాములు జువ్వల శ్రావణ్ స్వామి, గాండ్ల సుభాష్ స్వామి తదితర స్వాములు పాల్గొన్నారు.