Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 6:44 pm Posted by : ramakrishna

బంగారు పతకం సాధించిన విద్యార్థి

  • అభినందించిన సబ్ సబ్ కలెక్టర్, స్థానికులు

 

మద్నూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఆరవ జిల్లా స్థాయి యోగాసన క్రీడా లో (స్పోర్ట్స్ ఛాంపియన్షిప్) – 2025 లో స్థానిక విద్యార్థిని ప్రతిభ చాటింది. డోంగ్లి మండల  సిర్పూర్  గ్రామానికి చెందిన జ్యోతి సంతోష్ ఆప్ప దంపతుల కుమార్తె  8వ తరగతి విద్యార్థిని ఎం.శ్రద్ధ యోగాసన క్రీడా లో హ్యాండ్ బ్యాలెన్స్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలిచి, బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ  బసవ రెడ్డి , టీచర్స్‌ అసోసియేషన్ సభ్యుడు  విద్యాసాగర్  ఆమెను సత్కరించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కూడా శ్రద్ధను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతం నుండి ప్రతిభ చాటిన ఈ బాలిక విజయం పట్ల ప్రాంతీయ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మద్నూర్ ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలు శ్రద్ధ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Gold medalist student