Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 6:09 pm Posted by : ramakrishna

రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందజేత

బతుకమ్మ, ఏర్గట్ల: తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన రెండవ స్నాతకోత్సవం లో తెలుగు యంఏ (పిజీ) విభాగం లో 2014-2016 గాను రాష్ట్ర గవర్నర్  జిస్ను దేవ్ వర్మ  చేతుల మీదుగా  మోత్కూరు శ్రావణి విజయ్ గౌడ్  గుమ్మిర్యాల్ నాగేంద్ర నగర్ స్కూల్ అసిస్టెన్స్తె, గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించిన మోత్కూరు శ్రావణి మాట్లాడుతూ కృషి పట్టుదల ఆత్మ విశ్వాసం ఉంటె ఏదైనా సాధించవచ్చు అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నా భర్త విజయ్ గౌడ్ సహకారం ఉండటం వల్ల నేను ఈ గోల్డ్ మెడల్ సాధించాను అని మోత్కూరు శ్రావణి విజయ్ గౌడ్ అన్నారు.