Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 8:27 pm Posted by : ramakrishna

పట్టించుకోని జిఎంఆర్ అధికారులు

 

. . . అంధకారంలో మగ్గుతున్న వాహనదారులు

 

భిక్కనూరు, బతుకమ్మ

 

భిక్కనూరు మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఎన్ హెచ్ 44 హైవే అంధకారంలో మగ్గుతుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై భిక్కనూరు ప్రాంతంలో ఉన్న ఐమాక్స్ లైట్లు నెలరోజుల నుండి వెలగడం లేదు దీంతో వాహనాదారులు మండల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో లైట్లు వెలగక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిఎంఆర్ అధికారులు ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు.