మెండోరా, బతుకమ్మ: విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ వంతు సహాయంగా పాఠశాలకు 15 కుర్చీలు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శుభా అన్నారు. శుక్రవారం మెండోరా మండలంలోని పోచంపాడు లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-10 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల బృందం పాఠశాల పై గల మక్కువతో పాఠశాలకు తమ వంతు సహాయంగా 15 కుర్చీలను నరేష్, శ్రీనివాస్, శ్రీకాంత్ మొదలగు విద్యార్థుల బృందం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కు అందించారు. ఈ సందర్భంగా 2009-10 బ్యాచ్ విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, భూపతి రావు, సురేందర్, ఫిజికల్ డైరెక్టర్ నరేందర్, సురేఖ, గురువా, ఉమా, అపర్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు.