హైదరాబాద్, బతుకమ్మ: శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులోని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇచ్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ముగిసిన తరువాత మిగతా జిల్లాల్లో పంపిణీ చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులతోపాటు పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ మీ సేవ కేంద్రాల వద్ద రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం అధికారులను ప్రశ్నించగా.. దరఖాస్తు చేసిన వారే మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తున్నారని వారు సమాధానమిచ్చారు. వెంటవెంటనే కార్డులు పంపిణీ చేస్తే ఇలా పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.