ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కలిసిన జీహెచ్ఎంలు
వెబ్ న్యూస్, బతుకమ్మ : వివిధ జిల్లాల జీహెచ్ఎంలు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని కలిశారు. జీహెచ్ఎంల ప్రమోషన్స్ ను త్వరగా ఇప్పించాలని ఆయన్ను కోరారు. మేనెలలో ఇప్పిస్తానని ఎమ్మెల్సీ చెప్పారని వారు తెలిపారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను కలిసి వెబ్ ఆప్షన్స్ వద్ద ఆగిపోయిన జీహెచ్ఎం ప్రమోషన్స్ ని ఇప్పించాలని కోరారు. మే నెలలో ఇప్పించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం యాస్పిరేట్స్ జస్వంత్, కృపాల్ సింగ్, దిలీప్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, ఇతరులు పాల్గొన్నారు.