Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 7:35 pm Posted by : ramakrishna

సేవ చేసే అవకాశం ఇవ్వండి

– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్

బతుకమ్మ,ఆర్మూర్ :  పట్టభద్రులు తనకు ఓట్లు వేసి గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మధనం గంగాధర్ చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తాను డి.ఎస్.పి ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ చేయడానికి వచ్చానని అన్నారు. తనను గెలిపిస్తే అందరి మన్ననలను పొంది సేవ చేస్తానన్నారు. 26 సంవత్సరాల పోలీస్ ఉద్యోగ జీవితంలోని అనుభవాన్ని ప్రజా జీవితంలో ఉపయోగిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఓటర్ల సభ్యత్వ నమోదుకు బుధవారం చివరి రోజు కాబట్టి పట్టభద్రులు తమ పేర్లను తహసిల్దార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో 10 నుంచి 12 లక్షల మంది డిగ్రీ చదివిన వారు ఉన్న తక్కువ మంది ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్నార న్నారు. పట్టభద్రులు ఓటర్లుగా నమోదుకు చేసుకోవడానికి గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా నమోదు కాని వారికి ఈనెల 23వ తేదీ నుంచి తిరిగి అవకాశం ఇస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. కాబట్టి పట్టపద్రులందరూ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.