జిజి కళాశాల అధ్యాపకురాలు నాగజ్యోతికి డాక్టరేట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆంగ్లవిభాగం అధ్యాపకురాలు నాగజ్యోతి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి "మంజు కపూర్ రచించిన నవలలలో కుటుంబం, వివాహం మరియు సమాజం" అనే అంశంపై " డాక్టర్ కె.వి. రమణాచారి పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల "స్టాఫ్ క్లబ్" ఆధ్వర్యంలో డాక్టర్ నాగజ్యోతిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకురాలు నాగజ్యోతి బోధనలోనూ, కళాశాల కార్యక్రమాలన్నింటిలో చురుకుగా సేవలు...