ప్రశాంతంగా కొనసాగుతున్న జీజీ కళాశాల పరీక్షలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. గురువారం పరీక్షకు 1277 విద్యార్థులకు గాను 1250 మంది విద్యార్థులు హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను 117 మంది విద్యార్థులు రాశారని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎస్.రంగరత్నం తెలిపారు.