స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వండి
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో ముందుకు వెళ్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధం అవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు....