విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ కాలూర్ పాఠశాలలో విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు, పెన్నులు అందజేశారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలగాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్ మోహన్, శ్రీనివాస్, రాజా శేఖర్,బాల శేఖర్, ఇంచార్జ్ హెచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.