నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజు ప్రభుత్వ కళాశాలలో గురువారం జి.సి.టి.ఏ. (తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్), టీజీవో(తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్) క్యాలెండర్ 2026 ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి.జి.సి.టి.ఏ. జిల్లా అధ్యక్షుడు దండు స్వామి, సభ్యులు భరత్ రాజ్, నహిదా బేగం, లెఫ్టినెంట్ డా. రామస్వామి, ముత్తెన్న, చంద్రశేఖర్, ఉమాకిరణ్, అధ్యాపకులు వినయ్ కుమార్, రంజిత, జయప్రసాద్, రాహుల్, బాలమణి, వేణు గోపాల్, దీపక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
