ఏర్గట్ల కేజీబీవీ పాఠశాలకు జిసిడిఓ తనిఖీ
బతుకమ్మ,ఏర్గట్ల: మండలం లోని కేజీబీవీ పాఠశాలను జిసిడిఓ అధికారిణి భాగ్యలక్ష్మి సందర్శించారు. పాఠశాల పరిసరాలను వంటగది, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి భోజననాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే తరగతి గదులను గమనించి పాఠశాల పిల్లలకు తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఎస్ఓ సంధ్య, ఉపాధ్యాయురాలు లలిత భార్గవి,వసంత,అమల, స్రవంతి,అర్చన, కళ్యాణి,అకౌంటెంట్ శాంత, పాఠశాల నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు.