Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 8:07 pm Posted by : ramakrishna

ఏర్గట్ల కేజీబీవీ ని పరిశీలించిన జిసిడిఓ భాగ్యలక్ష్మి

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్ యందు 9 తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆదివారం రోజున కోతుల గుంపు దాడిలో అంజలికి చేయి విరగడం, వెన్నుపూసకు గాయం కావడంతో ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతున్నది. ఇట్టి విషయమై జిల్లా జిసిడిఓ భాగ్యలక్ష్మి ఏర్గట్ల మండల కేజీబీవీ స్కూల్ కి రావడం జరిగింది.అలాగే కేజీబీవీ స్కూల్ సిబ్బందితో పరిసరాలను పరిశీలించి, స్కూల్ విద్యార్థి అంజలి బిల్డింగ్ పై నుండి పడి పోవడానికి కారణాలు తెలుసుకొని, వంట రూమ్, వంట సామాను,పరిశీలించి మళ్లీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని నిజామాబాద్ జిసిడిఓ భాగ్యలక్ష్మి కేజీబీవీ స్కూల్ ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది.