గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి

హైదరాబాద్, బతుకమ్మ :  ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర వేలాది భక్తుల మధ్య ఘనంగా కొనసాగింది. హుస్సేన్ సాగర్  వద్ద ఎన్టీఆర్ మార్గ్ లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద శనివారం బడా గణేశ్ గంగమ్మకు ఒడికి చేరాడు. ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయకుడికి తుది పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు.