గంగమ్మ చెంతనే దుర్గమ్మ
మెదక్, బతుకమ్మ : మంజీర లో వరద పెరగడంతో మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయాన్ని శనివారం మళ్లీ మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద ఉధ్రుతంగా మంజీర నది ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న మంజీరకు భారీగా వరదనీరు చేరుతుంది.