Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 7:56 pm Posted by : ramakrishna

అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్స్ దొంగల ముఠా అరెస్ట్

– బోధన్ ఏసీపీ శ్రీనివాస్ 

బతుకమ్మ, బోధన్ : గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్స్ లను దొంగతనం చేస్తున్న  ఆతర్రాష్ట కాపర్ కాయల దొంగల ముఠా ను పట్టుకున్నట్లు బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం  బోధన్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సాలూర క్యాంపు వద్ద బోధన్ రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేయు సమయంలో అనుమానాస్పదంగా కారులో వస్తున్న వారిని పట్టుకొని విచారించగా జిల్లాలో 30 కి పైగా ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్ర ఔరంగబాద్ కు చెందిన భిమారావ్, రాజు,సంతోష్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కాపర్ కాయలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు,రూరల్ ఎస్సై మచ్చెందర్ ను అభినందించారు.