Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 12:04 pm Posted by : ramakrishna

 గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలి

. . . ఏఎస్ఐ రమేష్

బతుకమ్మ, జుక్కల్ :  గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని జుక్కల్ ఏఎస్ఐ రమేష్ అన్నారు. జుక్కల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే స్థలంలో డీజేలు, సౌండ్ బాక్స్ లు నిర్వహిస్తే అనుమతి తీసుకోవాలని అన్నారు. శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు.ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, కానిస్టేబుళ్లు పరమేష్, ఖలీమ్,హోంగార్డు యశ్వంత్, యువకులు తదితరులు పాల్గొన్నారు.