మోర్తాడ్, బతుకమ్మ: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల రాయల్ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతిని ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చేసిన గురిజాల నర్సారెడ్డి, రాము, నిహార్, రాఘవ, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.