రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ లోని బూత్ నెంబర్ 72 లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి అభ్యున్నతికి కృషి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన అని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలుపొందించాలని ఈ సందర్భంగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హామీద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.