Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 3:40 pm Posted by : ramakrishna

రాష్ట్ర సెపక్ తక్రా ఉపాధ్యక్షులు గా గాధారి సంజీవ్ రెడ్డి

 

నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ  :

హైదరాబాద్ లోని ఫాతే మైదాన్ క్లబ్ లో  తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో స్టేట్ కార్యవర్గం ను అదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నిజామాబాదు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గాధరి సంజీవ్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు గా, అలాగే చామకురా భాగరెడ్డి కార్యవర్గ సభ్యులు గా ఎంపికయినాట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షులు, నూడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గా సంజీవరెడ్డి, భాగరెడ్డి కార్యవర్గ సభ్యులు గా ఎంపిక పట్ల జిల్లా అధ్యక్షులు కేశ వేణు కార్యవర్గ సభ్యులు ల్యాబ్ గంగారెడ్డి, దీపిక, సతీష్ రెడ్డి, మీసాల ప్రశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.