Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 2:06 pm Posted by : ramakrishna

నేటి నుంచి మీ నీడ మీకు కనిపించదు

వెబ్ న్యూస్, బతుకమ్మ: సాధారణంగా సూర్యోదయం తరువాత మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏదో ఒక పక్క నీడ కనిపిస్తుంది. కానీ ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు మనిషి నీడ మాయమవుతుంది. దీనిని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్(ఐఏఎస్ సీ) జాతీయ కన్వీనర్ సుసత్యరేఖ ధ్రువీకరించారు.

ఏడాదిలో రెండు సార్లు కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు లంబంగా పడతాయని, దీంతో నిలువు వస్తువులు, నిల్చున్న మనుషుల నీడ మధ్యాహ్నం వేళ రెండు నిమిషాల పాటు కనిపించదని తెలిపారు.

అయితే ఈ పరిస్థితి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మరి మీ ప్రాంతంలో మీ నీడ కనిపిస్తుందో..? లేదో..? ఒకసారి చెక్ చేయండి.