బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని చిన్న కొడపు గల్ గ్రామంలో గురువారం నాడు ఏఎంసి ఛైర్మన్ మనోజ్ కుమార్ వైస్ ఛైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం సహకారంతో చిన్నకోడప్గల్ గ్రామంలో పశు ఆరోగ్యం మరియు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించదాము. .భారీ సంఖ్యలో రైతులు, ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 123 గేదెలు మరియు ఆవులకు సాధారణ ఆరోగ్య సమస్యలు మరియు 50 గర్బకోష సమస్యలకు చికిత్స అందించబడ్డాయి మరియు 45 దూడలకు నులిపురుగుల నిర్మూలన జరిగింది అర్హత కలిగిన రైతులకు మందులు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, చిన్న కొడంపూ గల్ సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి, నాయకులు హనుమాన్లు, సూరత్వంత్ రెడ్డి, శివకుమార్, డైరెక్టర్లు, ఏఎంసీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.