రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచంద రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, యువకులు వినీత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మచ్కురి రమేష్, సూరజ్ శ్రీనివాస్ తదితరులు స్వచందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అలాగే రాణంపల్లి గ్రామంలో ధాత్రిశ్రీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మెడికవర్ ఆసుపత్రి వారిచే బీపి, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు కేవి మోహన్, డిస్టిక్ చైర్మన్, రేజియాన్ కోఆఆర్డినేటర్, లయన్స్ సభ్యులు పుట్టి సాగర్, శామీర్, గాండ్ల మధు, శ్రీకాంత్ గౌడ్, కే. సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
