నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉచిత అంబలి పంపిణి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సందర్బంగా ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణి కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుండి మా ట్రస్టు ద్వారా నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం వేసవి కాలం ముగిసే వరకు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఇలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సమాజ సేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ అధినేత దిగంబర్ పవర్, తాజా మాజీ కార్పొరేటర్ బైకన్ సుధా మధు, నగర ప్రముఖులు పున్నయ్య, సదాశివ,రామ స్వామి, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, శిలా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
