లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని కోమట్ పల్లి గ్రామంలో జాతకాల పేరుతో మోసం చేస్తున్న కొందరిని శుక్రవారం స్థానికలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొందరు అపరచిత వ్యక్తులు జాతకాలను చెబుతామని తిరుగుతూ మీ ఇంట్లో కొద్ది రోజుల్లో అశుభం జరుగుతుందని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆ అశుభం జరగకుండా ఉండాలంటే పూజలు చేయాలని అందుకోసం కొద్దిగా ఖర్చు అవుతుందని అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వీరిని స్థానికులు పట్టకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
