కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలని లో కుక్కలు స్వెర విహారం చేశాయి. నలుగురు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. గాయపడ్డవారు ఆస్పత్రి లొ చికిత్స పొందుతున్నారు. కుక్కలు ఎప్పుడూ ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అని కాలనీ వాసులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలు గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడులు చేసి గాయపారుస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని, వాటి బెడద నుంచి తమను కాపాడాలని...