మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు అస్వస్థత

హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ గా ఉందని, ఏఐజీ  ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. తెలంగాణ ప్రజలు,కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదం తో వేగంగా కోలుకొని తెలంగాణ సమాజానికి సేవలు అందిస్తారని పేర్కొన్నారు.