Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 7:53 pm Posted by : ramakrishna

గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి దంపతులు సతీసమేతంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండలి సభ్యులు ఏంది రవీందర్ రెడ్డి దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, గణేష్ మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ అధ్యక్షులు అడప సాయిలు, ఇందూర్ కార్తీక్, షేక్ నిస్సార్, పార్వతి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.