బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలో మాజీ వార్డు సభ్యురాలు అనిత ఇటీవల కాలంలో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వేంట సొసైటీ చైర్మన్లు భూమిరెడ్డి, వెంకట్ రెడ్డి, రాజా గౌడ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గోపాల్, మాజీ ఉపసర్పంచ్ బిక్షపతి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.