ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్ వారి మామ ఇటీవలే మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్(ఆర్టీసీ) మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నివాళులర్పించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగే కొన్ని సంఘటనలకు అధైర్యపడవద్దని తెలిపారు.
- సిఐ నరేష్ కుటుంబాన్ని పరామర్శ..
లోలం గ్రామంలోని సిఐ నరేష్ అమ్మ మరణించడంతో మాజీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శాఖ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పూలమాలవేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ నాయక్,పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి దాసు,ఉపాధ్యక్షులు శెట్టి బిరీష్, మాజీ ఎంపీటీసీ చింతల దాసు, సర్పంచ్ మోహన్ నాయక్,పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాశం కుమార్,ఆరేటి రఘు, తదితరులు పాల్గొన్నారు.
