కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన బీయర్ఎస్ నాయకుడు హళదే శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. శ్రీనివాస్ తల్లి ఇటీవలే మరణించగా వారిని ఆయన పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఎమ్మెల్యే వెంట బీయర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.