మెండోరా, బతుకమ్మ:
మెండోరా మండల కేంద్రంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా సోమవారం నిర్వహించిన వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన గ్రామస్థులకు,విడిసి,ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 40 లక్షలతో నూతన కల్యాణ మండపం నిర్మించుకున్నమని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేండోరా గ్రామంలో కోట్ల నిధులతో అనేక ఆభివృద్ది పనులు చేసుకున్నము అని తెలిపారు. ఇకముందు కూడా నా శక్తీ మేర గ్రామానికి పనులు చేయడానికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే అన్నారు..ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మీ అందరికి విజయాలు చేకూర్చాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
