Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 1:00 pm Posted by : ramakrishna

యూరియా కోసం క్యూ లైన్లో..మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్,బతుకమ్మ :  యూరియా కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిలబడ్డారు.  మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం  సత్యవతి రాథోడ్ క్యూలో వేచి ఉండి యూరియా తీసుకున్నారు.  తన సొంత గ్రామం పెద్దతండాలో  తనకున్న ఐదున్నర ఎకరాల భూమి కి  యూరియా అవసరమైందిద.  ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని సత్యవతి రాథోడ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.