Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:17 pm Posted by : ramakrishna

చంద్రాయన్ పల్లీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ మంత్రి

 

ఇందల్వాయి, బతుకమ్మ  :

ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లీ సర్పంచ్ ఆరేటి రఘు కుటుంబాన్ని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు.ఇటివలే ఆరేటి రఘు వాళ్ళ అమ్మ మాజీ సర్పంచ్ ఆరేటి బాలవ్వ అనారోగ్యం తో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఆందోళన చెందవద్దని సర్పంచ్ ఆరేటి రఘు కు మండవ భరోసా ఇచ్చారు. చంద్రాయన్ పల్లీ గ్రామ అభివృద్ధి కోసం మాజీ సర్పంచ్ ఆరేటి బాలవ్వ ఎంతో తపించిపోయేవారని గుర్తు చేశారు. ఆయన వెంట మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సంజీవ రెడ్డి,తదితరులు ఉన్నారు.

Former Minister calls on Chandrayanpalli Sarpanch
Former Minister calls on Chandrayanpalli Sarpanch