Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 10:15 am Posted by : ramakrishna

ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ సోమవారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధి సమస్యతో బాధపడుతూ  ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు సీఎంగా పని చేశారు. 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. కాగా, సోరెన్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.