నిజామాబాద్ వినియోగదారుల డివిజన్ కమిటీల ఏర్పాటు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ వినియోగదారుల డివిజన్ కమిటీలను ఎన్నుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ అద్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరయ్యారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డివిజన్ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని విస్తృత పరిచే భాగంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా రాజుల రామనాథం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులుగా పౌడపల్లి ...