రుద్రూర్, బతుకమ్మ: జాతీయ ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ఫుడ్ సైన్స్ విద్యార్థులు స్వచ్ఛభారత్ లో భాగంగా రుద్రూర్ బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, అధ్యాపకులు సాయి ప్రసాద్, సిబ్బంది కిషోర్ సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.