Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 2:20 pm Posted by : ramakrishna

ఎస్ఏ-1 పరీక్షల పై దృష్టి సారించాలి

నవీపేట్, బతుకమ్మ: ఉపాధ్యాయులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-1 పరీక్షలపై దృష్టి సారించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో దుర్గాప్రసాద్ ఆదేశించారు. మండలంలోని మహంతం, మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోకాన్ పల్లి కేజీబీవీని డీఈవో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎస్ఏ-2  పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు సూచించారు.

Focus should be on SA-1 exams