Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 5:51 pm Posted by : ramakrishna

ఫారెస్ట్ భూములలో అడవులను చదును చేస్తే సహించేది లేదు

  • ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్
  • అక్రమంగా అటవీ శాఖ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు

బతుకమ్మ, ఇందల్వాయి : ఇందల్వాయి రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండల శివారులో దుబ్బాక బీట్ నంబర్ 383లో అటవీ భూమిని అక్రమంగా చదను చేస్తున్న రానే సమయసం సమాచారంతో శుక్రవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ జాన్ డీరి ట్రాక్టర్ TS 02 3122 ను పట్టుకొని జప్తు చేయడం జరిగిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ తెలిపారు.అనంతరం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలోకి ట్రాక్టర్ ను తరలించామని తెలిపారు. అటవీ ఉప క్షేత్ర అధికారిధర్పల్లి బీట్ ఆఫీసర్లు ఖదీర్ వినయ్ బెస్ట్ క్యాంప్ అధికారులు,ప్రవీణ్, విలాస్ రావు,ఇందల్వాయి, ధర్పల్లి,పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు.