నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఐదు వాహనాలు వెనుక నుంచి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన నగరంలోని జీజీ కళాశాల బైపాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకాలే ఉన్న రెండు కార్లు ఢీకొన్నాయి. వాటి వెనుకాలే ఉన్న మరో రెండు డీసీఎంలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రెండుకారు ధ్వంసం కాగా, ఓ ఢీసీఎం అద్దం పగిలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.
