ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోల మృతి
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలోని కంద మాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రత దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సంఘటన స్థలంలో గల ఆయుధాలను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది.