మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో కుక్క ఐదుగురిని కరిచిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఇద్దరు చిన్నారులను, ముగ్గురు పెద్దవారిని కుక్క కరవడంతో గ్రామంలో భయందోళన నెలకొందని స్థానికులు పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో కుక్కలు బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
