అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్లను రైల్వే ఎస్సై సాయారెడ్డి మంగళవారం రైల్వే స్టేషన్ లోని పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, అగ్నిమాపక సిబ్బంది తెలింపారు. వన్ టౌన్ ఎస్సై మొగిలయ్య, ఏఎస్సై హమీద్ ఖాన్, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.