కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు సజీవదహనం

వెబ్ న్యూస్,బతుకమ్మ  : కర్ణాటకలోని చింతామణి దగ్గర ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొని భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో, ఆస్పత్రికి తరలించారు. కారులో బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈఘటన జరిగింది.