బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
బతుకమ్మ, బాల్కొండ : మండలంలోని బోడేపల్లి గ్రామానికి చెందిన బర్ల కాపరి ఎట్టెం మల్లయ్య ఇటీవలే ప్రమాదవశత్తు చెరువులో పడి మృతి చెందగా వారి కుటుంబానికి కానిస్టేన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నగదు సహాయం అందించారు. భాధిత కుటుంబ తక్షణ అవసరాల నిమిత్తం రూ. 5000 నగదును శనివారం ఆయన అనుచరులు అందజేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.