Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 5:34 pm Posted by : ramakrishna

అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం

మెండోరా,బతుకమ్మ: మెండోరా మండల కేంద్రానికి చెందిన తుమ్మల భూదేవి  గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. వారిది పేద కుటుంబం అంత్యక్రియలకు డబ్బులు లేవని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆమె అంత్యక్రియల కొరకు రూ. 5000 ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది. అలాగే అదే మండల కేంద్రానికి చెందిన బెస్త లక్కంపల్లి రమేష్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ గారు ఆయన అంత్యక్రియల కొరకు 5000 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని పంపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Financial assistance for funerals