Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 5:03 pm Posted by : ramakrishna

అంతక్రియలకు ఆర్థిక సహాయం 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామర్తి బలరాం మరణించడంతో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పదివేల ఆర్థిక సాయం అందించాడు. చంద్రకాంత్ మాట్లాడుతూ షబ్బీర్ ఆలీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సాయం అందించాలని కోరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, భూం రెడ్డి, మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.